Entertainment జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన మంగళగిరి సభలో తన వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడారు ఈ సందర్భంగా తనకు జరిగిన మూడు పెళ్లిళ్లు తాను తను భార్యలకు ఇచ్చిన భరణం కోసం చెప్పుకొచ్చారు.. అయితే గతంలో తాను చిల్లిగవ్వ కూడా భరణంగా తీసుకోలేదంటూ రేణు దేశాయ్ పెట్టిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి నాయకుల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంగళగిరి బహిరంగ సభలో ఈ విషయంపై మాట్లాడుతూ.. “వైసీపీ నాయకులు ప్రతిసారీ తన మూడు పెళ్లిళ్ల గురించే మాట్లాడతారు.. మీక్కూడా చేసుకోవాలని ఉంటే.. మీరు కూడా చేసుకోండి. నేను మూడు పెళ్లిళ్లు విడాకులు ఇచ్చి చేసుకున్నాను.. మీరు కూడా కావాలంటే చేసుకోండి.. ఒక్క పెళ్లి చేసుకుని ముప్పై స్టెప్నీలను మెయింటైన్ చేసే మీరా? నా మూడు పెళ్లిళ్లపై మాట్లాడేది’ అంటూ సెటైర్లు వేశారు.. అంతేకాకుండా “నేను ఎవరికీ అన్యాయం చేయలేదు నా మొదటి భార్యకు 5 కోట్లు భరణంగా ఇచ్చి విడాకులు తీసుకున్న నా రెండో భార్యకు నా ఆస్తి మొత్తం రాసిచ్చాకే మూడో పెళ్లి చేసుకున్న.. “అంటూ చెప్పుకొచ్చారు..
అయితే గతంలో ఓసారి రేణు దేశాయ్ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క రూపాయి కూడా అన్యాయంగా భరణం తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు ఈ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది అయితే అన్యాయంగా మరణం తీసుకోలేదు అన్నారే కానీ న్యాయపరంగా తనకు రావాల్సింది తీసుకోలేదని అనలేదుగా అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..