Crime News : ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్ల అరాచకం అధికమవుతుంది. బాగా చదువుకున్న వారి దగ్గర నుండి గ్రామాల నివసించే ప్రజల వరకు సైబర్ నేరగాళ్ల చేతులు మోసపోతున్న వార్తలను మనం రోజు చదువుతూనే ఉన్నాం. ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఇటువంటి తరుణంలో నే నెల్లూరు జిల్లాకు చెందిన పోలీస్ బృందం క్రియేటివ్ గా ఆలోచించి వినూతనంగా ప్రచారం చేయడం జరుగుతుంది.
అన్నా.. లోన్ యాప్స్ జోలికి పోకే.. ఆళ్లు జలగ లెక్క.. నీ రత్తాన్ని పీల్సి పీల్సి పాణం తీస్తారన్నా.. ఆర్ఆర్ఆర్ డైలాగ్ అలానే పుష్పాలోని ఏం శ్రీవల్లి… ఆన్లైన్ లోన్ యాప్ లో పట్టీలు కొన్నానే… ప్రాణం పోతధి స్వామి..లోన్ యాప్ జోలికి పోమాకు. అని మీమ్స్ క్రియేట్ చేసి ప్రజలకు ఆన్లైన్ యాప్ తో ప్రమాదం ఉందని హెచ్చరించడం జరుగుతుంది. ఏంటబ్బా పోలీసులకు ఇంత ఏంటబ్బా పోలీసు ఇంత క్రెడిట్ గా క్రియేటివ్ గా ఆలోచించాను. ఏంటి అబ్బా నెల్లూరు పోలీసులు ఇంత క్రియేటివ్ గా ఆలోచించారా అని ఒక డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. అయితే ఇటువంటి సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంటుంది వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మహిళ లోన్ యాప్లో రూ.2,500 నగదు తీసుకున్నారు. అయితే ఆ యాప్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. దాదాపు 70 వేల వరకు ఆమెతో లోన్ కట్టించుకోవడం జరిగింది.ఇంకా బాకీ ఉందని బెదిరించి ఆమెను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది.