Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ప్రభాస్ కి దేశ విదేశాలలో కూడా అభిమానులను సొంతం చేసింది. ఆ చిత్రం తర్వాత ఆయన నటించిన సాహూ, రాదేశ్యాం తదితర చిత్రాలను ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేశారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ పలు కారణాల రీత్యా ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రభాస్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులంతా నిరాశకు గురయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి డార్లింగ్ అభిమానులు ఫీల్ అయ్యేలా ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఆదిపురుష్ బాటలోనే సలార్ కూడా వాయిదా పడనున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ దాదాపు వాయిదా పడినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వర్కింగ్ స్టిల్స్ మూవీపై మరింత అంచనాలను పెంచేసాయి. కేజీఎఫ్ వంటి సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్… ప్రభాస్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ మారడంతో ఆ సినిమా ప్రభావం సలార్ పై పడనుందని… అందుకే ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంతా అంకుంటున్నారు. మరోవైపు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె అనే చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటే మారుతి, సందీప్ రెడ్డి వంగా, చిత్రాలు వరుసలో ఉన్నాయి.