Entertainment తాజాగా విడుదలైన బుట్ట బొమ్మ సినిమా డిజాస్టర్ గా మిగిలిం ది ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన ఏ సినిమా అయినా మినిమం గ్యారంటీ అనే టాక్ ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం అంచనాలన్నిటిని తలకిందులు చేస్తూ ఫస్ట్ షో నుంచే అట్టర్ ఫ్లాప్ అనే టాక్ ను తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ఫలితం పై స్పందించారు నిర్మాత నాగవంశీ..
బుట్ట బొమ్మ సినిమా ఫ్లాఫ్ అవడంపై స్పందించారు నిర్మాత నాగ వంశీ. అలాగే ఈ సినిమా ఫలితంపై మాట్లాడుతూ వైరల్ కామెంట్స్ చేశారు.. మలయాళీ సినిమా నచ్చే దానికి రీమేక్ గా బుట్ట బొమ్మ సినిమాను తెరకెక్కించాము. అయితే మూడేళ్ల క్రితం చూసినప్పుడు ఈ సినిమా చాలా బాగా అనిపించింది. కానీ ఇప్పుడు అభిమానుల ఆలోచనలు, అభిరుచులు మారిపోయాయి. అందుకే ఈ సినిమాను అభిమానులు ఆదరించ లేకపోయారు. అయితే ఈ సినిమా చూసిన త్రివిక్రమ్ విడుదలకు ముందే సినిమా ఆడే అవకాశాలు లేవని చెప్పేశారు అందుకే మేము డిస్ట్రిబ్యూటర్ల నుంచి డబ్బులు తీసుకోకుండా సినిమాని విడుదల చేశాము.. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి..
అంతేకాకుండా కొన్ని సినిమాలు హిట్ అవుతాయని అనుకుంటూ తీస్తాము. కానీ పరాజయాన్ని చవిచూస్తాయి.. కానీ బుట్ట బొమ్మ సినిమా మాత్రం ముందుగానే పరాజయం అవుతుందని ఊహించాము. కానీ దీనివల్ల ఎవరికీ ఇబ్బంది రాకుండా విడుదల చేయాలని నిర్ణయించుకొని డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తనివ్వలేదు అంటూ తెలిపారు.