Entertainment జీవితంలో జరిగిన చేదు అనుభవాల కోసం చెప్పుకొచ్చింది ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన. డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండ తో కలిసి లిప్ లాక్ సీన్లో నటించింది ఈ భామ. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై వచ్చిన ట్రోల్లింగ్స్కు తాను చాలా భయపడ్డాను అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు..
రష్మిక మందన తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అంతేకాకుండా అందువచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది.. పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఈ మామ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంది.. అయితే జీవితంలో తనుకొని చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది.. స్వభావరీత్యా తాను చాలా సున్నిత మనస్కురాలని.. ఎవరు ఏమన్నా చాలా బాధపడతానని చెప్పింది. అయితే విజయ్ దేవరకొండ తో తను నటించిన డియర్ కామ్రేడ్ మూవీలో లిప్ లాక్ సీన్పై జరిగిన ట్రోలింగ్ తనను చాలా భయపెట్టిందని చెప్పింది. ఆ సమయంలో తనని ట్రోల్ చేస్తూ ఎందరో నెగిటివ్ కామెంట్స్ పెట్టారని.. దాంతో తను చాలా భయపడిందని అన్నది. అంతేకాకుండా ఆ ట్రోలింగ్స్ వల్ల రాత్రిపూట నిద్రలేకుండా పోయేదని.. పిచ్చి పిచ్చి కలలు వచ్చేవని చెప్పుకొచ్చింది. ఈ లోకమంతా తనని వెలివేసినట్టు అందరికీ దూరంగా తను వెళ్ళిపోయినట్టు కలలు వచ్చేవని చెప్పింది.. అంతేకాకుండా ఆ కలలో తాను ఎవరినో వేడుకుంటున్నట్టు బతిమాలుతున్నట్టు అనిపించదని వాటన్నిటి వల్ల నిద్ర లేకుండా పోయేదని చెప్పింది అర్ధరాత్రి లెగిచి ఎన్నోసార్లు ఏడ్చానని చెప్పుకొచ్చింది..