Entertainment పాన్ ఇండియా లెవెల్లో స్టార్డమ్ తెచ్చుకున్న సమంత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాతో పాటు మీడియా ముందుకు రావడం కూడా తగ్గించేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఏవో ఒక పోస్టులు పెట్టే సమంత చాలా రోజుల నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలు కూడా బ్రేక్ ఇచ్చింది. అయితే వీటన్నిటి వెనుక ఉన్న అసలు కారణం ఏమై ఉంటుందని ఆమె అభిమానులు తెగ హైరానా పడిపోతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి అమెరికా వెళ్ళినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న సమంత.. ట్రీట్మెంట్ కోసమే అంత దూరం వెళ్లారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సమంతకు ఫేస్ మీద కూడా ఈ ఎలర్జీ ఎటాక్ అయిందని.. అందుకే రీసెంట్ గా ఆమె మాస్క్, కళ్లద్దాలు పెట్టుకొని తన ఫేస్ ను కవర్ చేస్తూ తిరుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తను వాడిన కాస్మోటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వల్లే ఇట్లా జరిగిందని తెలుస్తుంది. అయితే ఇందులో నిజం ఎంత ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికి సమంత నటించిన శాకుంతల, యశోద మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండతో ప్రస్తుతం ఖుషి మూవీ లో నటిస్తుంది. అయితే లైగర్ సినిమా ప్లాప్ తో అప్సెట్ అయి ఉన్న విజయ్ కు సమంత చిత్రీకరణకు బ్రేక్ ఇవ్వటంతో మరింత అప్సెట్ అయినట్టు సమాచారం. ఖుషి సినిమాను డిసెంబర్ 23న విడుదల చేస్తామని ఇప్పటికే సినీ బృందం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత ఇచ్చిన బ్రేక్ వలన సినిమా షూటింగ్ లేట్ అయ్యి.. విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది.