Gossips సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సమంత.. ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయిపోయిందో ఎవరికి అర్థం కావట్లేదు. ఎప్పుడు తనకు సంబంధించిన విషయాలు లేదా ఫ్యాషన్ రిలేటెడ్, సినిమాల కోసం ఏదో ఒక పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత గత కొన్ని వారాలుగా వీటన్నిటికీ దూరమైపోయింది. అయితే ఇందుకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియట్లేదు. ముందు నుంచి ఫేస్ బుక్ కి దూరంగా ఉండే సమంత ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఎక్కువగానే పోస్ట్లు పెడుతుంది. అలాగే ట్విట్టర్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉండేది. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
సమంత ఇలా ఒక్కసారిగా ఇలా సోషల్ మీడియాకు ఎందుకు దూరమైపోయిందో ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉంది అనుకోవడానికి కూడా లేదు. యశోద మూవీలో నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ అయితే జరగటం లేదు. ఖుషిలో నటిస్తున్న ఆ షెడ్యూల్ ఇంకా ప్రారంభమే కాలేదు. అయితే సినిమాలు కూడా లేని సమయంలో సమంత సోషల్ మీడియా కారణం దూరం అవటానికి కారణం.. కేవలం ఆమె మానసిక ప్రశాంతత కోసం అందరికీ దూరంగా ఉండాలనుకుంటుందని.. గత కొన్నాళ్లుగా తన జీవితంలో జరుగుతున్న విషయాలను మార్పులను అంగీకరించడానికి తనకు ఇంకొంచెం సమయం కావాలని అంటున్నారు. తనమీద ట్రోల్స్ కూడా చాలానే వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటినీ పట్టించుకోని సమంత తన పని తను చేసుకోపోతుంది.
చైతన్యతో విడాకులు తర్వాత సమంత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. మానసికంగా తను ఎంతో దెబ్బతిన్నాది. విపరీతంగా ఈ విషయంలో అందరూ సమంతనే ట్రోల్ చేశారు. తను 250 కోట్లు భరణం తీసుకుంటున్నట్టు కూడా రూమర్లు వచ్చాయి. అయితే ఇవేవీ నిజం కాదని సమంత క్లారిటీ ఇచ్చేసింది.