Entertainment టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా హైదరాబాద్ నుంచి మకాం మార్చినున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటివరకు హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కొని ఇక్కడే ఉన్న సమంత మరికొద్ది రోజుల్లో ముంబైకి వెళ్లిపోబోతున్నట్టు సమాచారం..
స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో విడాకులు అనంతరం మానసికంగా చాలా కృంగిపోయిన సమంత తర్వాత ఆరోగ్యంపరంగా పలు సమస్యలు ఎదుర్కొంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత ఎక్కడ కనిపించినా చాలా నీరసంగా బాధపడుతూ కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తన చుట్టూ ఉండే పరిస్థితులను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం తను హైదరాబాద్ను వదిలేయనున్నట్టు కూడా తెలుస్తోంది.. ఇక్కడ పరిస్థితులను మార్చి హైదరాబాద్కు గుడ్ బై చెప్పేస్తున్నట్టు సమాచారం. ఇందుకు తగినట్టే సమంత ముంబైలో 15 కోట్లు పెట్టి త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను కొన్నట్టు.. మరికొద్ది రోజుల్లో సమంత ముంబై వెళ్ళిపోతుందని అక్కడే ఇంకా శాశ్వతంగా మక్కం పెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది..
మయోసైటిస్ వ్యాధికి ముందు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే సమంత.. ఆ తర్వాత మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం తగ్గించేసింది. బయట ఎక్కడ కనిపించినా మీడియాను తప్పుకుంటూ వెళ్లిపోవాలని ప్రయత్నిస్తూ ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గర అవటానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అసలు విషయం ఏంటి అని తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.. అలాగే తాజాగా సమంత నటించిన శాకుంతల చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..