Entertainment ప్రస్తుతం బాలీవుడ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అక్కడి చిత్రాలకు సరైన ఆదరణ దక్కట్లేదు. బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి. అదే సమయంలో సౌత్ ఇండియన్ సినిమాలు తమ కంటెంట్తో బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటున్నాయి. అక్కడ రాజమౌళి బహుబలి, KGF సీరీస్లు, సుకుమార్ పుష్ప సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన కాంతార కూడా సంచలనం సృష్టిస్తుండటంతో ఇప్పడు ఎక్కడ చూసినా సౌత్ సినిమాలే హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేజీఎఫ్ 2’ లో నటించి ఆకట్టు కున్న సంజయ్ తనకు మరిన్ని సౌత్ సినిమాల్లో నటించాలని ఉందని తన మనసులో మాటను చెప్పాడు. అలాగే బాలీవుడ్ మేకర్స్ మూసా పద్ధతిని వీడి.. కంటెంట్ వున్న సినిమాల మీద దృష్టి పెట్టాలని అన్నారు.. అంతేకాకుండా బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ ధోరణి వీడకపోతే తర్వాత కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.. అయితే ఇప్పటికే ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం ఎంతైనా అవసరమని ముఖ్యంగా టాలెంట్ను ఎంకరేజ్ చేయాలని అలాగే పెద్ద నటులు తమ రెమ్యూనేషన్ను తగ్గించుకుంటూ సినీ ఇండస్ట్రీని ఆదరించాలని అన్నారు.. నెపోటిజం కాస్టింగ్ కౌచ్ వంటి విషయాలతో బాలీవుడ్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం తాను సౌత్ ఇండియా సినిమాల్లో నటించడానికి మోసగా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు..