హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని ‘తెలంగాణ జాతీయ సమైక్యతాదినంగా పాటించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామ క్రమం 2022 సెప్టెంబర్ 17 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏడాదిపాటు ‘తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం 3 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకొన్నది. ప్రారంభ వేడుకలను ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ముగింపు వేడుకలను 2023 సెప్టెంబర్ 16,17,18 తేదీలలో మూడురోజులపాటు నిర్వహిస్తారు. వజ్రోత్సవాలతోపాటుగా మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
పోడు భూములపై సమన్వయ సమావేశాలు :
పోడు భూముల సమస్య పరిష్కారంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. గిరిజనుల పోడు భూముల సమస్య పరిషారానికి ప్రతి జిల్లాలో రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది.
వజ్రోత్సవ ప్రారంభ కార్యక్రమాల వివరాలు సెప్టెంబర్ 16
★ రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు
సెప్టెంబర్ 17
★ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ, ప్రసంగంఅన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయితీ కేంద్రాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిషరణ.
★ హైదరాబాద్లో నిర్మించిన బంజారా,ఆదివాసీ భవన్ల ప్రారంభం.
★ నెక్లెస్ రోడ్డు నుంచి అంబేదర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు. అనంతరం బహిరంగ సభ. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగిస్తారు.
సెప్టెంబర్ 18
★ అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మాన సత్కారాలు. తెలంగాణ స్ఫూర్తిని చాటేలా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
క్యాబినెట్ నిర్ణయాలు
★ జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు. జీహెచ్ఎంసీలో 5 నుండి 15కు, ఇతర కార్పొరేషన్లలో 5 నుండి 10 వరకు కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపుదల.
★ నూతనంగా ఏర్పడిన అటవీ విశ్వవిద్యాలయానికి కొత్త పోస్టుల మంజూరు.
★ సుంకిశాల నుంచి హైద్రాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరచాలని నిర్ణయం. ఇందులో భాగం గా అదనంగా 33 టీఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలని తీర్మానం. ఇందుకు 2214.79 కోట్లు మంజూరు.
★ రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలకు 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపునకు నిర్ణయం.
★ భద్రాచలం ముంపు ప్రాంతాల్లోని 2,016 కుటుంబాలకు నూతనంగా కాలనీల నిర్మాణం.