Crime కొన్ని రోజుల క్రితం గోవా పర్యటనకు వెళ్లిన భాజపా నేత, నటి సోనాలి ఫొగాట్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆమె గుండె పోటుతో చనిపోయిందని అందరూ అనుకున్నారు… కానీ.. ఆమెను హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు అనుమానిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పోస్ట్ మారటం నివేదిక సైతం ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు తేలింది. దాంతో… అనూహ్య మలుపు తిరిగిన ఈ కేసులో.. తాజాగా… మరోసారి వార్తల్లో నిలుస్తుంది.
సోనాలి హత్యకు రూ.10 కోట్ల డీల్ జరిగిందంటూ తాజాగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోనాలీ హత్యకు సంబంధించి కొందరి నుంచి రెండు లేఖలు అందుకున్నట్లు వెల్లడించిన నటి కుటుంబ సభ్యులు… తమకు రెండు లేఖలు అందాయని… వాటిలో ఒకదాంట్లో రూ.10 కోట్ల డీల్ జరిగిందంటూ ఉండగా… ప్రముఖ రాజకీయ నేతల పేర్లు మరో లేఖలో ఉన్నాయని వెల్లడించారు. ఈ లేఖల్లో ముఖ్యమైన సమాచారం ఉండటంతో వీటిపై దర్యాప్తు చేపట్టాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసు విచారణలో… సోనాలి సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్తో పాటు పలువురిని అరెస్టు చేశారు. ప్రస్తుత లేఖతో ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని సోనాలి కుమార్తె కోరడంతో సిబిఐ విచారణకు ప్రభుత్వ ఆదేశించింది.. అయితే ఇప్పటికే ఆమె ఆస్తి కోసం ఆమెను హత్య చేసినట్టు వీరిద్దరూ అంగీకరించడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు సిబిఐ అధికారులు..