Devotional News : ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమ తమ దైవాలను తమదైన శైలిలో పూజిస్తారు. చర్చ్ గుడి మసీద్ కాసేపు కూర్చుంటే మనశాంతిగా ఉంటుంది. అయితే హిందూ ఆచారంలో చాలామంది గుడికి వెళ్లిన భక్తులు గుడి వెనకున్న భాగాన్ని మొక్కుతుంటారు. ఇలా హిందూ ఆచారంలో ప్రతి గుడిని మొక్కుతూ ఉంటారు భక్తులు. కాగా ఇలా పురాతన కాలం నుంచి తమ తమ పెద్దవాళ్ళను చూసి చేస్తూ ఉంటారు కొందరు మరికొందరు మాత్రం దీనికి గల రహస్యాన్ని తెలుసుకొని గుడి వెనుక భాగాన్ని మొక్కుతూ ఉంటారు.ఇలా గుడి వెనక భాగాన్ని మొక్కటం గల విశిష్టతను తెలియజేస్తున్నారు పురోహితులు.
అయితే చాలామంది ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మొక్కుతూ ఉంటే వీళ్లేంటిరా గుడి వెనక భాగాన్ని కూడా మొక్కుతున్నారు అని అనుకుంటారు. అయితే గుడిలో మూలవిరాట్టు వుండే గర్భాలయం ప్రశస్తమైంది గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు.
నిత్యం పూజలు మంత్రార్చన చేయడం ద్వారా భగవంతుని పూజించిన మంత్రాన్ని ఆ మందిరంలోనే పవిత్రంగా ఉంటాయి. అలానే గుడి వెనుక బాగా గోడకు దైవం కాస్త దగ్గరగా ఉంటుంది. ప్రదక్షణ సమయంలో దైవాన్ని ముందుగా వెనుక భాగాన్ని మొక్కడం ద్వారా దర్శించుకున్నామని భావిస్తారు. ఇలా చేయడం ద్వారా భగవంతుడికి తమ మదిలో కోరికలు చెప్పుకుంటే నేరుగా దైవానికి చేరుతుందని భక్తుల భావన. అయితే కొంతమంది మాత్రం ఈ ఆచారాన్ని పురాతన ఆచారం అనుకోని భావిస్తారు. ఏదైనాప్పటికీ పవిత్రమైన మనసుతో ఆ దైవాన్ని ప్రార్థిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.