Crime Viral బీజేపీ నాయకురాలు, నటి అయిన సోనాలి ఫోగట్ హత్య కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది.. అయితే రోజురోజుకు ఈ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తూ దేశమంతా సంచలనం రేపుతున్నాయి..
అయితే ఇప్పటికే సోనాలి వ్యక్తిగత సహాయకుడైన సుధీర్ సాంగ్వాన్ ఆమె ఆస్తి కోసం డ్రగ్స్ అలవాటు చేసినట్టు అంగీకరించాడని గోవా పోలీసులు తెలిపారు.. ఆమెకు మత్తు మందు ఇవ్వటానికి సుఖ్విందర్ సహాయం చేశాడని సాంగ్వాన్ అంగీకరించాడు.. అలా జరిగిన పార్టీలో ఆమె తాగిన డ్రింకులో హానికరమైన మత్తుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్లే ఆమె మరణించింది అని గోవా పోలీసులు వెల్లడించారు..
అయితే ఈ తరుణంలో ఆమె నివాసంలో సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.. బెడ్ రూమ్, దుస్తుల కబోర్డ్, పాస్వర్డ్ తో వున్న లాకర్ ను సోదా చేసినట్టు తెలుస్తుంది.. ఇందులో పోలీసులకు మూడు డైరీలు కనిపించినట్టు సమాచారం.. వీటిలో ఆమె ఇతర రాష్ట్రాల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది.. తన ఆదాయం ఖర్చులతో పాటు కొందరు ప్రముఖులు రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు, సమాచారం ఈ డైరీల్లో ఉన్నట్టు వెల్లడైంది.. విచారణ చేపడుతున్న పోలీసులకు ఈ డైరీలు అనేవి కీలకంగా మారనున్నట్టు తెలుస్తుంది.