ఇటీవల మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ తరుణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పాల్వాయి స్రవంతి తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కేసీఆర్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించారు.
మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ టికెట్ కోసం ఆ పార్టీలోని చాలా మంది సీనియర్ నేతలు ప్రయత్నించారు. చివరిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ ఎన్నిక నవంబరు 3న జరుగుతుంది. 6న ఓట్లు లెక్కిస్తారు.