Entertainment కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార విగ్నేశ్ శివన్ ఇద్దరూ కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న నయనతార అభిమానులంతా షాకు గురయ్యారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. రోజులు గడుస్తున్నా ఈ వివాదంపై వచ్చిన వార్తలు మాత్రం తగ్గటం లేదు దీనిపై మొదటిసారి విజ్ఞేశ్ శివన్ స్పందించాడు
నయనతార విగ్నేష్ శివన్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే ఈ పోస్ట్ పెట్టిన దగ్గరనుంచి ఎన్నో వివాదాలు తెరతీసాయి అసలు వీళ్లు ఎలా తల్లిదండ్రి అయ్యారు అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేకపోయినా అందరూ మాత్రం సరోగసి విధానం అని ఫిక్స్ అయిపోయారు అయితే వీళ్ళు ఈ సరోగసికి సంబంధించి రూల్స్ పాటించారా లేదా అనేది వివాదం అయింది దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రస్తుతం విజ్ఞేశ్ శివన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది..
“మన వెన్నంటే ఎల్లప్పుడు ఉండి, మన బాగోగులు చూసుకునేవారి అభిప్రాయాలను గౌరవించు. వారే మనకోసం మంచిగా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్లే నీ వాళ్లు. ఎప్పటికి ఇదే వాస్తవం.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని నీకు లభిస్తాయి. అంత వరకు సహనంతో ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో” అని విఘ్నేశ్ చెప్పుకొచ్చారు..