Movie టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన టైగర్ సినిమా పరాజయంపై మొదటిసారి నోరు విప్పారు.. ఈ సినిమా ప్లాప్ తర్వాత బయట ఎక్కువగా కనిపించని విజయ్ మొదటిసారి సైమా వేడుకల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పూరి జగన్నాధ దర్శకత్వంలో వచ్చిన లైజర్ సినిమా పరాజయంపై మాట్లాడారు విజయ్..
సైమా అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ 10, 11 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఈ సైమా వేడుకల్లో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా అవార్డును గెలుచుకున్నారు.. ఈ సందర్భంగా తన టైగర్ సినిమా సరిగా ఆడక పోవడంపై స్పందించారు.. ”ఈ వేదికపై అవార్డు తీసుకున్న వారందరికీ నా అభినందనలు. గొప్ప సినిమాలతో ఈ ఏడాది చిత్రపరిశ్రమను మీరు ముందుకు తీసుకువెళ్లారు. నేను కూడా ప్రయత్నించా. అందుకోసం ఎంతగానో కష్టపడి పనిచేశా. కానీ ఆ కష్టం సరిపోలేదు. మనందరి జీవితాల్లో మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. ఎలాంటి రోజుల్లోనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులన్నింటినీ జాగ్రత్తగా పూర్తి చేయాలి. నిజం చెప్పాలంటే నేను ఈ కార్యక్రమానికి రాకూడదనుకున్నా. కానీ మీ అందరికీ ఓ మాట ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చా. అభిమానులు, కుటుంబం, స్నేహితుల్ని అలరించేందుకు నేను మరింత కష్టపడి పనిచేస్తా.. ” అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు..
పూరీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ ఫైటర్గా కనిపించారు. ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కు శివ నిర్వాణ దర్శకుడు. మంచి ప్రేమ కథతో రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది..