Political ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయ దుమారం చెలరేగుతుంది అధికార వైసిపి చేసే పనులు ప్రజలలో వ్యతిరేక భావాన్ని రేకెత్తిస్తున్నాయి.. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్తీ యూనివర్సిటీ గా మారుస్తూ వైసిపి తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్ర ప్రజలు ఎంతగానో వ్యతిరేకించారు.. అయితే ఈ దుమారం చల్లారక ముందే మరో వివాదానికి తెరతీసింది వైసిపి..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రేపిన రాజకీయ దుమారం చల్లారకముందే.. మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల అధికార వైసిపి విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా విజయనగరంలో ఎంతో ఘన చరిత్ర ఉన్న మహారాజా ఆస్పత్రి పేరును కూడా ఒక్కరోజులో మార్చేసింది. మహారాజా జిల్లా కేంద్రం ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చారు. రాత్రి కి రాత్రే ఆస్పత్రి పేరును మారుస్తూ బోర్డులు ప్రత్యక్షం అవడం అందరిని ఆశ్చర్యాన్ని గురి చేసింది.. తాజాగా ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు స్థానికులు పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
ఆస్పత్రికి మహారాజా ఆస్పత్రి పేరునే కొనసాగించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన మహారాజా రాజవంశాన్ని అవమానించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు.. విషయాన్ని ప్రజలు క్షమించబోరని నినాదాలు వ్యక్తం చేశారు..