Crime అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుందో ఇళ్లాలు. సక్రమంగా సాగిపోతున్న బంధాన్ని కాదంటూ… కట్టుకున్న భర్తకు నిద్రమాత్రలతో చంపేంసింది. పైగా… అర్థరాత్రి వేళ తన భర్తకు గుండె పోటు వచ్చిందంటూ నమ్మించి అంత్యక్రియలు సైతం జరిపించేసింది. కానీ… నిజం నిలకడగా అయినా బయటకు వస్తుంది అన్న మాటను నిజం చేస్తూ… ఆ ఇల్లాలి కుట్ర నెమ్మదిగా బయటకు వచ్చింది. బంధువులనే కాదు… పోలీసులను సైతం ఆశ్చర్యపరిచిన ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని కె.గంగవరం మండలం బాలాంత్రం గ్రామానికి చెందిన కోలా సుబ్బారావుకు… సత్య వెంకట లక్ష్మీలకు 2009లో వివాహం జరిగింది. అప్పటి నుంచి అన్యోన్యంగానే సాగుతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా కుదుపు వచ్చింది. ఈ ఏడాది జూన్ 1న సుబ్బారావు పడుకున్న వాడు పడుకున్నట్లే చనిపోయాడు. దాంతో… బంధువులకు, కుటుంబ సభ్యులకు తన భర్తకు గుండె పోటు వచ్చిందని చెప్పి, నమ్మించింది…అతని భార్య వెంకట లక్ష్మీ. నిజమని నమ్మిన వారంతా… దహన సంస్కారాలు పూర్తి చేశారు.
అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత వెంకట లక్ష్మీ ప్రవర్తనలో మార్పు కనిపించింది. తను ఓ వ్యక్తితో చనువుగా ఉండడమే కాకుండా.. తనకు తరచూ తన వద్దకు రావడాన్ని గమనించారు. అతను అదే ప్రాంతానిిక చెందిన ఉసిరి శ్రీనివాస్గా గుర్తించారు. వీరిద్దరికి పరిచయంపై కూపీ లాగాగా… విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. దాంతో… సుబ్బారావు మృతిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు… కుటుంబ సభ్యులు. విచారణ చేపట్టిన పోలీసులకు… సత్య వెంకటలక్ష్మీ తన భర్తకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను ఇచ్చినట్లు తేలింది. తమ మధ్యనున్న సంబంధం తన భర్తకు తెలిసిపోతుందన్న భయంతో ముందుగానే ప్రణాళికతో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారాన్ని పొగొట్టుకున్న సత్యవెంకటలక్ష్మీ ప్లానింగ్కు అంతా షాక్ అయ్యారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి… రిమాండ్కు తరలించారు.