Crime News : శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. బావామరదళ్లు వరసయ్యే యువకుడు, యువతి ప్రేమలో పడ్డారు. కానీ వారి ప్రేమను ప్రేమ వ్యవహారం పెద్దలకు చెబితే ఒప్పుకోరనే భయంతో ఇంటి నుంచి పారిపోయారు. ఆ తర్వాత వెళ్లిపోయి వారు వివాహం చేసుకున్నారు. ఐతే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వారు ఓ హోటల్ గదిలో విగతజీవులుగా కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురవుతున్నారు.
ఇక వివరాలలోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం, చిన్నకొత్తపేట ప్రాంతానికి చెందిన కందివలస దామోదర్ (20) డిగ్రీ చదువుతున్నాడు. అదే జిల్లా బలగం గ్రామానికి చెందిన ఆదపాక సంతోషి కుమారి (17) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి తాజాగా ఓ వివాహ వేడుకలో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కాగా సోమవారం సాయంత్రం గొల్లలపాలెం రామాలయం సమీపంలో అయ్యన్ రెసిడెన్సీలో సోమవారం మధ్యాహ్నం 12గంటలకు వీరు ఒక గది తీసుకున్నారని తెలుస్తుంది. కానీ మంగళవారం సాయంత్రం వరకు వీరిద్దరూ బయటికి రాకపోవడాన్ని హోటల్ సిబ్బంది గమనించింది.
దీంతో ఆ గది నుంచి కొద్దిగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా ఇద్దరు బాత్రూమ్లోని కిటికీ ఊచలకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. యువతి మెడలో పసుపుతాడు ఉంది. కాగా వీరి బలవన్మరణానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి… మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. దామోదర్, సంతోషి ప్రేమ వ్యవహారం తమకు తెలియదని… తెలిసుంటే పెళ్లికి అంగీకరించేవాళ్లమని చెప్పి వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.