Healthv
Health మారిపోతున్న జీవనశైలితో పాటు మనుషుల అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో సరేనా ఆహారం తీసుకోక చాలా మంది అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే వీటిని ఎదుర్కోవాలి అంటే సరైన ఆహారం నియమాలు పాటించడం తప్పనిసరి. అయితే మనం రోజు తీసుకునే ఆహారంలో ఏం చేర్చుకోవాలనేది తెలుసుకోవాల్సిందే.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. వీటితోపాటు రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తీసుకోవడం తప్పనిసరి. కొందరికి చిన్న పని చేసిన చాలా అలసటగా అనిపిస్తుంది. అందుకు కారణం బాడీలో ఐరన్ కంటెంట్ తక్కువ అవటం. అందు కోసం ఉదయం పూట తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పల్లీలు, బెల్లం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ గుడ్లు వంటివి చేర్చుకోవాలి. రోజు ఒక గ్లాస్ పాలు తీసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. ఖర్జూరాన్ని రోజు తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధికమించవచ్చు..
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే ఒక గ్లాసు రాగిజావ తీసుకోవడం చాలా మంచిది. ఇది ఒంటికి కావలసిన పోషకాలు అందిస్తుంది. అదేవిధంగా ఓట్స్ తీసుకున్నా మంచి ఫలితమే ఉంటుంది. బాగా అలసటగా అనిపిస్తుంటే బాడీకి కావలసిన పోషకాలు అందటం లేదనే అర్థం. దీన్ని అధికమించాలి అంటే ఉదయాన్నే తీసుకునే అల్పాహారాన్ని పోషకాలు ఉన్న వాటితో నింపాలి. మొలకెత్తిన గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి. పప్పు ధాన్యాలు, ఆకుకూరలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.. అలాగే రోజు కాసేపు ఎండలో నడవడం అలవాటు చేసుకుంటే బాడీకి కావాల్సిన డి విటమిన్ అంది ఎముకలు గట్టిగా మారుతాయి. ఎన్ని చేసినా సరైన నిద్ర ఉండటం మాత్రం తప్పనిసరి..