Health మనిషి ఆహారపు అలవాట్లే అతని ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఎంత మంచి ఆహారం తీసుకుంటే… అంత మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. కానీ… చాలా మంది పని ఒత్తిడి పేరుతో తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి… పరిస్థితులు చేతులు దాటాక బాధపడుతుంటారు. అందుకే… సమయానికి భోజనం చేయడంతో పాటు… సరైన పోషకాలున్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలంటారు… ఆహార నిపుణులు. రోజువారీ ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకుంటే… మీకు కావాల్సిన అన్ని పోషకాలు అందినట్టే…
పెరుగు.. రోజూ పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇందులో అన్ని రకాల ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వాటితో పాటు కాల్షియం, విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధిక స్థాయిలో ఉంటాయి. పప్పు దినుసులు.. తరచుగా పప్పు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. పప్పు దినుసుల్లో ఫైబర్, ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా ఉపయోగపడతాయి. పప్పు దినుసుల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు లభిస్తాయి.
రాగులు, జొన్నలు, సజ్జలు.. మన పూర్వికుల ఆహారంలో రాగులు, జొన్నలు, సజ్జలు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే వారు అన్నేళ్లు, అంత ఆరోగ్యంగా జీవించారు.మిల్లెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడంలో తోడ్పడతాయి. మిల్లెట్లు తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.