Krishna : సూపర్స్టార్ కృష్ణ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత గానే కాకుండా రాజకీయ నాయకుడిగా సేవలు అందించారు. కృష్ణ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తన నటనా కౌశలంతో ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ అని మోదీ కొనియాడారు. ఈ విషాదకర సమయంలో కృష్ణ తనయుడు మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించి తెలుగు భాషలో ట్వీట్ చేశారు.
అలానే కృష్ణ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తీవ్ర ధిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో… సినీ పరిశ్రమ అభివృద్ధికి కృష్ణ చేసిన సేవలను గుర్తు చేశారు. సినిమా పట్ల ఆయనకు అసమానమైన గౌరవం, క్రమశిక్షణ ఉండేదని రాహుల్ కొనియాడారు. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు అని… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్.
కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో @urstrulyMahesh, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) November 15, 2022
Deeply saddened by the news of the passing away of Telugu cinema superstar, Ghattamaneni Krishna ji.
His unmatched professional discipline and work ethics set an example on conduct in public life. My heartfelt condolences to his family, friends and fans. pic.twitter.com/cO83w8kNiT
— Rahul Gandhi (@RahulGandhi) November 15, 2022
కాగా సూపర్ స్టార్ కృష్ణకు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహాంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు కృష్ణ. 1989 లో ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నేరుగా లోక్ సభ ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 71 వేల భారీ మెజార్టీతో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పై విజయం సాధించారు సూపర్ స్టార్ కృష్ణ. అలా రాజీవ్ గాంధీకి, కృష్ణ కు మధ్య స్నేహ బంధం పెరిగింది. అయితే, ఆప్తమిత్రుడైన రాజీవ్ మరణంతో రాజకీయాలకు దూరమయ్యారు కృష్ణ.