Entertainment వచ్చే ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు వారసుడు సినిమా కోసం ఇప్పటికే చాలా ధియేటర్లను బ్లాక్ చేసి పెట్టారని వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు..
ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు తాజాగా పలుకీలక వ్యాఖ్యలు చేశారు.. “వారసుడు చిత్ర విడుదల ఆపాలి అనుకుంటే నన్ను పిలిచి ఛాంబర్ లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట్లాడాలి. కానీ వారు నేరుగా మీడియాతో మాట్లాడతారు. ప్రజలకు సంబంధం లేని విషయాన్ని మీడియాలో పంచుకోవాల్సిన అవసరం లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు దాదాపు 70 థియేటర్స్ ఉన్నాయి. నా థియేటర్స్ లో నా సినిమా వేసుకుంటా.. అందులో తప్పేముంది అన్నారు… అలాగే దిల్ రాజు ఎదుగుతున్నాడు ఎలాగైనా దెబ్బతీయాలని అనుకుంటున్నా వారికి నేను ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు.. అలాగే తమిళనాడులో 800 థియేటర్స్ ఉన్నాయి. విజయ్ అక్కడ అందరికంటే పెద్ద స్టార్. అజిత్ మూవీ కూడా విడుదల అవుతుంది. నాకు 400 థియేటర్స్ ఇస్తున్నారు. అజిత్ పెద్ద స్టార్ కాబట్టి కనీసం మరో 50 థియేటర్స్ ఇవ్వమని అడుక్కుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ తో ఎలాంటి వివాదం లేదు. అన్ని చిత్రాలకు థియేటర్స్ దొరుకుతాయి. ఇవన్నీ జనవరి మొదటి వారంలో మాట్లాడవలసిన విషయాలు కానీ ఇప్పుడు ఎందుకు వీటి వివాదం లేవనెత్తి ఏదో చేసేస్తున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత దిల్ రాజు..