Entertainment గత ఏడాది జూలైలో లలిత్ మోడీతో డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించింది సుష్మితసేన్. ఆ బంధం మున్నాళ్ల ముచ్చటకే మిగిలిందని సిని వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటికి ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా సుస్మితాసేన్ కూతురు బర్త్డే పార్టీలో ఆమె ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కనిపించడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశం అయింది.
సుష్మిత సేన్ కూతురు రినీ సేన్ బర్త్డే గ్రాండ్గా జరిగింది. ఈ పార్టీకి సుష్మిత బాయ్ ఫ్రెండ్ రోహ్మన్తో పాటు తన మరో మాజీ ప్రియుడు రితిక్ భాసిన్ కూడా వచ్చాడు. అయితే ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘సెప్టెంబర్ 4న నా ఫస్ట్ లవ్ రినీ సేన్ 23వ పుట్టినరోజు.. నా కుటుంబసభ్యులు, రినీ ఫ్రెండ్స్తో రాత్రి పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేశాం. రినీ బర్త్డేను ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసిన రితిక్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఐ లవ్యూ గయ్స్’ అని రాసుకొచ్చింది. అయితే ఈ పార్టీకి లలిత్ మోదీ రాలేదు, కానీ ఆమె మాజీ బాయ్ఫ్రెండ్స్ రావడం.. వారితో పార్టీ చేసుకోవడమేంటో నెటిజన్లకు కూడా అర్దం కావటం లేదు.
అయితే ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీతో సుస్మిత సేన్ రిలేషన్ విషయాన్ని లలిత్ మోడీ ఏ స్వయంగా ఇంస్టాగ్రామ్ లో వెల్లడించాడు.. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ విడిపోయారని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి