GossipsGossipsGossips
Gossips మాజీ విశ్వసుందరి సుస్మితసేన్, లలిత మోదీలా బంధం ముగిసిందా అవుననే అంటున్నారు.. సుస్మిత సేన్ చాలా ఏళ్లుగా తనకంటే చిన్నవాడైనా మోడల్ రోహ్మన్ షాల్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే వీళ్ళిద్దరూ గత ఏడాది విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే తర్వాత ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీతో సుస్మిత సేన్ రిలేషన్ మొదలైంది.. ఈ విషయాన్ని లలిత్ మోడీ ఏ స్వయంగా ఇంస్టాగ్రామ్ లో వెల్లడించాడు.. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ విడిపోయారని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
“నా లైఫ్ బెటర్ పార్టనర్ సుష్మితా సేన్తో కలిసి మాల్దీవులు, సార్దినాలల్లో తిరిగి ఇప్పుడే లండన్కు వచ్చాం. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మేమిద్దరం ప్రేమలో ఉన్నాం. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా పెళ్లి చేసుకుంటం.. “‘ అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా సుస్మితా సేన్ తో కలిసి ఉన్న ఫోటోనూ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ ఫోటోగా పెట్టారు. ఇందులో “నా కొత్త జీవితం ప్రారంభమైంది. మై లవ్ @sushmitasen47″అని బయోలో రాసుకొచ్చారు.
అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ సుస్మిత తో ఉన్న ఆ పోస్ట్ ను లలిత్ మోడీ డిలీట్ చేశాడు.. ప్రొఫైల్లో సుస్మిత పేరును కూడా తొలగించాడు దీంతో వీళ్ళిద్దరూ బ్రేకప్ అయ్యారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. నెటిజెన్లు ఇంకా ఆగకుండా వీళ్లపై తెగ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఏం జరిగిందన్న విషయం తెలియాలి.. అంటే వీళ్ళిద్దరి నుంచి అఫీషియల్ న్యూస్ రావాల్సిందే..