Health చిన్నపిల్లల్ని పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తినే చేపలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అయితే వీటిని తిని తర్వాత కొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అవేంటో చూద్దాం..
చేపలు కొన్ని ఆహార పదార్థాలతో కలిసినప్పుడు విషం గా మారుతాయి అవి శరీరానికి హానిచేస్తాయి అందుకే వీటిని తిన్న తర్వాత పెరుగును ఇట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు పెరుగులో ఉండే ప్రోటీన్స్ చేపలతో కలిసినప్పుడు విష పదార్థంగా మారుతాయని తెలుస్తోంది.. చేపలు తిన్న తర్వాత పాలు కానీ.. పాల సంబంధిత పదార్థాలు కానీ తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి..
అలాగే చేపలు తిన్న తర్వాత కాఫీ కానీ టీ కానీ తీసుకోకూడదు వీటిలో ఉండే కెఫిన్ చేపలతో కలిసి శరీరానికి హాని చేస్తుంది.. అలాగే ఎలాంటి ఐస్ క్రీమ్ కూడా చేపల తిన్నాక తినకూడదు.. అలాగే పాలతో చేసిన స్వీట్స్ ని కూడా చేపలతో కలిపి తినకూడదు.. ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి అంతేకాకుండా చికెన్ ని కూడా చేపలతో కలిపి తినకూడదంట ఈ రెండిటిలో ఉండే ప్రోటీన్స్ జీర్ణక్రియను దెబ్బతీస్తాయని తెలుస్తోంది అలాగే పాల సంబంధిత ఏ పదార్థాలను కూడా మాంసాహారం తిన్న వెంటనే తినకపోవడం మంచిది..