Entertainment టాలీవుడ్ లో దాదాపు 70 సినిమాలకు పైగా నటించిన నటి పూజిత తెలుగు తో పాటు తమ్మిదా మలయాళ కన్నడ భాషల్లో 150 వరకు సినిమాల్లో నటించింది అయితే ఇప్పుడు ఆమె పెద్దగా కనిపించడం లేదు అయితే ఈమె తాజాగా టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ పై కామెంట్స్ చేశారు..
టాలీవుడ్ లో సీనియర్ నటి పూజిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఆమె దాదాపు అన్ని భాషల్లోని నటించారు ఇప్పటివరకు 150 పైగా చిత్రాలు నటించారు అలాగే రాజేంద్రప్రసాద్ తో పలు చిత్రాలను నటించిన ఆమె ఇద్దరు పెళ్ళాలు ముద్దుల పోలీస్ చిత్రంతో మంచి పాపులర్ అయ్యారు.. అలాగే ఈ సినిమాలో ఆయనకి రెండో భార్యగా కనిపించారు ఆ తర్వాత సైతం రాజేంద్రప్రసాద్ తో కలిసి ఎన్నో సినిమాలు నటించారు అయితే ఈమె తాజాగా ఎన్ని సినిమాల్లో ఆయనతో కలిసి నటించినప్పటికీ నాకు అవసరం వచ్చినప్పుడు మహా అసోసియేషన్ కి వెళితే నేను ఎవరో తెలియదన్నట్టు ప్రవర్తించారు ఆ సమయంలో అతనికి పోయేకాలం వచ్చింది అందుకే అలా ప్రవర్తించారు అనిపించింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు..
తనకు అవసరం ఉండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి వెళ్ళినప్పుడు రాజేంద్రప్రసాద్ ప్రవర్తించిన తీరుపై మాట్లాడిన పూజిత.. “నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లెటర్ కోసం వెళ్లాను. నేను కూడా మురళీమోహన్ గారి మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈసీ మెంబర్నే. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ వచ్చారు. అప్పుడు లెటర్ కోసం ‘మా’కి వెళ్లినప్పుడు రాజేంద్రప్రసాద్ గారు నేను ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తించారు. నాతో మాట్లాడితే తప్పు అన్నట్టుగా చూశారు. ఆయన గతాన్ని మరిచి ప్రవర్తించారు. ఇద్దరం ఈసీ మెంబర్స్గా చేసిన వాళ్లమే కానీ ఆయన ప్రెసిడెంట్ అయ్యేసరికి ఈసీ మెంబర్ని చిన్న చూపు చూశారు. నన్ను హేళన చేయడం నచ్చలేదు. రాజేంద్రప్రసాద్ పక్కన హీరోయిన్గా కూడా చేశా.. ఆయన సపోర్ట్ చేయలేదు.. శివాజీ రాజా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్లిద్దరూ హెల్ప్ చేయలేదు… ” అంటూ చెప్పుకొచ్చింది నటి పూజిత.