Viral news కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార విజ్ఞాన శివ తాజాగా ఇద్దరు కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా అసలు సరోగసి అంటే ఏంటి అనే విషయంపై చర్చ నడుస్తుంది అంతేకాకుండా ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ కాలంలో చాలామంది అనేక కారణాలతో పిల్లల్ని కనటానికి సరోగసి పద్ధతిని ఎంచుకుంటున్నారు అందులో సెలబ్రిటీలు మరింత ముందు ఉంటున్నారు.. పిల్లలు పుట్టడంలో సమస్యలు ఉన్నవాళ్లు అలాగే పెళ్లి మీద ఆసక్తి లేకుండా పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ఈ సరోగసి పద్ధతిలో ఎంచుకుంటున్నారు.. అయితే అసలు ఏంటి సరోగసి అనేది తెలుసుకుందాం..
ఈరోజుల్లో మారిపోతున్నారు ఆరోగ్య సైల తో పాటు ఆహార అలవాట్లు జీవనశైలి కూడా మారిపోతుంది వీటి వలన ముఖ్యంగా పిల్లలు పుట్టడంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా చాలామంది సరోగసిని ఎన్నుకుంటున్నారు అయితే సామాన్యులు సమస్యలతో ఈ సరోగ్య పద్ధతిని ఎంచుకుంటే సెలబ్రిటీలు పెళ్లిళ్లు వద్దనుకోను లేదంటే ఫిజిక్ పాడైపోతుందనే ఉద్దేశంతోనూ సరోగసి పద్ధతికి ఓటేస్తున్నారు.. అయితే అసలు సరోగసి అంటే ఏంటంటే..
ముఖ్యంగా సరోగసి పద్ధతి లో రెండు విధానాలు ఉన్నాయి. మొదటిది ట్రెడిషనల్ సరోగసి. భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు భర్త వీర్యాన్ని సేకరించి దాన్ని మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం ద్వారా బిడ్డను పుట్టిస్తారు… రెండోది జెస్టేషనల్ సరోగసి. ఈ పద్ధతిలో పుట్టే బిడ్డ కు దంపతుల్లో స్త్రీ అండాన్ని, పురుషుడి స్పెర్మ్తో ఫలదీకరణం చెందిస్తారు. ఆ పిండాన్ని మరో మహిళ గర్భాశయంలో పెంచుతారు. ఈ రోజుల్లో చాలామంది సెలబ్రిటీలు ఫాలో అయ్యేది ఈ పద్ధతినే.. అయితే ఆరోగ్య కారణాల దృష్ట్యా లేదా తమ ఫిజిక్ ను కాపాడుకునేందుకు చాలామంది ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు.. ఈ పద్ధతిలో బిడ్డను కని ఇచ్చిన తల్లికి ముందస్తు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లిస్తారు. అయితే ఆమెకు బిడ్డపై ఎలాంటి హక్కులూ ఉండవు