Health నిత్యం యవ్వనంగా మెరిసిపోవాలని ఎవరికీ ఉండదు ప్రతి ఒక్కరూ ఎప్పుడు యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు అందుకోసం ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటారు.. అయితే ఎన్ని చేసినా కానీ ఫుడ్ విషయంలో మాత్రం కంట్రోల్ లో ఉండకపోతే తొందరగానే వయసు మీద పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు అయితే అవేంటో అనేది తెలుసుకుందాం..
నిత్యం యవనంగా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాల్సిందే వాటిలో ముఖ్యంగా బయటకు వెళ్తే చాలు సోడాలు కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది ఇవి తొందరగా చర్మాన్ని సాగేటట్టు చేస్తాయి అందుకే కచ్చితంగా వీటికి దూరంగా ఉండాలి. రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆరు నుంచి పది గ్లాసుల నీరు తీసుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో అయినా బయట అయినా మసాలాలకు చాలా దూరంగా ఉండాలి రుచికరంగా ఉన్నాయి కదా అని మసాలా సంబంధిత ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే శరీరంపై మొటిమలు మచ్చలు రావడమే కాకుండా నిర్జీవంగా మారుతుంది.. అలాగే బయట దొరికే చిరుతిండ్లు జంక్ ఫుడ్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది ఇది చర్మానికి చాలా హానికరం.. అలాగే నిత్యం ఆల్కహాల్ తీసుకునేవారు తొందరగా వయసు మీద పడినట్టు కనిపిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి ఆల్కహాల్ శరీరంలో ఉండే నీటిని లాగేస్తుంది దీని వలన చర్మం నిగారింపును కోల్పోతుంది.. అంతేకాకుండా బయట దొరికే అన్ని రకాల చిరుతిల్లలో మైదా ఎక్కువగా ఉపయోగిస్తారు.. పిజ్జాలు బర్గర్లు వంటి వాటిలో మైదా శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే వీలైనంత వరకు వీటిని తీసుకోకపోవడం మంచిది..